పెషావర్‌ విమానాశ్రయంపై దాడి

– ఐదుగురు మృతి, 25 మందికి గాయాలు
పెషావర్‌, డిసెంబర్‌ 15 : పాకిస్థాన్‌లోని పెషావర్‌ విమానాశ్రయంపై శనివారం సాయంత్రం ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు దుర్మరణం చెందగా, 25 మంది గాయపడినట్లు సమాచారం. పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకే దుష్టశక్తులు ఇలాంటి దాడులకు తెగపడుతున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.