పేదలకు ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
యాలాల డిసెంబర్ 2(జనంసాక్షి)
నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలిచిందని  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాలాల మండలం ముద్దాయి పేట గ్రామానికి  చెందిన చెంగోలు పెద్ద చిన్నయ్య గౌడ్ కురూ.250000, అలీముద్దీన్ రూ.100000 రాజూగౌడ్ రూ. 275000 లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, వైస్ ఎంపీపీ రమేష్, తెరాస సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, దేవనూరు సర్పంచ్ ఆకుల శివకుమార్, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా లతో కలిసి అందించారు.