పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంయబ్యాంకు

వాషింగ్టన్‌: ప్రపంచలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వేల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ.65(1.25 అమెరికన్‌ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2బిలియన్‌) మందిని నిరూపేదలుగా ఇది పరిగణలోకి తీసుకుంది. వారిలో మూడో వంతు అంటే దాదాపు 40 కోట్ల మంది భారతీయులే ఉండటం గమానార్హం. పేదలు, నిరుపేదలు ఎక్కడున్నారనే ప్రాంతాలవారీ గణాంకాల ఆధారంగా రూపోందించిన ప్రపంచ అభివృద్ధి సూచికల ప్రకారం…. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరూపేదల సంఖ్యక్రమేపి తగ్గుతుంది.
1981లో ప్రపంచ నిరూపేదల్లో సగం మంది ఇక్కడే ఉండగా, అది 2010 నాటికి 21శాతానికి తగ్గింది. అయితే అభివృద్ధి చెందోతున్న దేశాల జనాభా మాత్రం 59 శాతం పెరిగింది. అయితే గురువారం ప్రపంచబ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం 120కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడో వంతు కన్నా ఎక్కువ మంది ఆఫ్రికాలోని ఉప సహారా ప్రాతంలో కేంద్రికృతమై ఉన్నారు. 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కోన్నారు. ఇప్పటికి ప్రపంచ జనాభాలో దాదాపు ఐదో వంతు మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారని ప్రపంచబ్యాంకు సీసియర్‌ ఉపాధ్యాక్షుడు, ఆర్థికవేత్త కౌశిక్‌ బసు వెల్లడించారు. ఆఫ్రికా ఉప సహారా ప్రాంతంలో అత్యంత పేదరికం స్థాయి 1999తో పోలిస్తే 2010నాటికి పది పాయింట్లు తగ్గి, 48 శాతం ఉంది. ప్రపంచం మొత్తం మీద పేదల సంఖ్యక్రమేపీ తగ్గుతుంటే ఒక్క ఈ ప్రాతంలో మాత్రం క్రమక్రమంగా పెరుగుతోంది.