పోడు భూముల పట్టాలు ఇవ్వడంలో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.

అందుకు కృతజ్ఞత తెలియజేస్తూ బైక్ ర్యాలీ.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల. సెప్టెంబర్ 23 2022
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రైతులు అచ్చంపేట,ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, నుండి మున్ననూర్,వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో సానుకూలంగా స్పందించి రైతులకు అన్ని విధాల ఆదుకునే కృషి చేయడానికి ఆనందిస్తూ అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు నల్లమల్ల ప్రాంతంలోని అప్పర్ ప్లాట్ గ పిలువబడే టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న రైతులు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు,  ప్రజా ప్రతినిధులు, మండల అధ్యక్షులు, గ్రామ సంఘ అధ్యక్షులు, పిఎసిఎస్ చైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు ,ఎంపీటీసీలు, యువజన సంఘాలు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.