పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి

ఎర్రవల్లి కూడలి నుండి గద్వాల జిల్లా కేంద్రానికి తరలిన పోలీసుల బైక్ ర్యాలీ

-కమాండెంట్ ఎన్. వి సాంబయ్య

ఇటిక్యాల అక్టోబర్ 28 (జనంసాక్షి) విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరుల త్యాగాలని స్మరించుకోవాలని పదవ బెటాలియన్ కమాండ్ ఎన్. వి సాంబయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బెటాలియన్ పోలీసులు బెటాలియం నుండి ఎర్రవల్లి కూడలి, గద్వాల జిల్లా కేంద్రం వరకి బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తూ.. వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలాగే పోలీసులు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకం అవుతూ ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం గద్వాలకు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నాగభూషణం, బెటాలియన్ ఆర్ఐ రాజు, వెంకటేశ్వర్లు, రాజారావు, బెటాలియన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.