పౌర్ణమి సందర్భంగా గూడెంలో భక్తుల సందడి

–సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు దండేపల్లి జనంసాక్షి.సెప్టెంబర్10:భాద్రపద పౌర్ణమి పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సందడి చేశారు.స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు దేవస్థానం నాకు వచ్చారు.152 జంటలు శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు చేసుకున్నారు.ఆలయ అధికారులు 1000 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.