ప్రగతి ప్రస్థాన సభకు బయలుదేరిన,ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు

ప్రగతి ప్రస్థాన సభకు బయలుదేరిన,ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు

బషీరాబాద్ సెప్టెంబర్ 27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో బుధ వారం రోజున కాశీంపూర్ చౌరస్తా నుండి తాండూరు కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు,ప్రజలు ప్రగతి ప్రస్థాన సభకు బయలుదేరిన్నారు.ఆర్థిక,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,పౌర సంబంధాల,భూగర్భ వనరుల,గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జి.రంజిత్ రెడ్డి, తాండూరు నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీ ఘనంగా స్వాగతం పలికేందుకు బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఈ రోజు గులాబి దళం ఊపందుకున్నదని, నాయకులు అందరూ ఏకతాటిగా కలిసి పని చేస్తామని ఈసారి జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యే చేస్తామని అందుకు మేము అందరం కష్టపడి పని చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వివిధ గ్రామాల ఎంపీటీసీలు,పిఎసిఎస్ డైరెక్టర్ అశోక్ గౌతం,బీఆర్ఎస్ నాయకులు మంతట్టి బి.కృష్ణ, కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.