ప్రజలపై అమ్మవారి దీవెనలు ఉండాలి

 బషీరాబాద్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మంతన్ గౌడ్  తండాలో మంగళవారం రోజున గ్రామస్తుల ఆధ్వర్యంలో సహస్ర చండీయాగం తండావాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఊరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో చాలంగా ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని  చండీయాగం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయత్రి రాము,ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ నాయక్, ఉపసర్పంచ్ ధన్ సింగ్, గ్రామ పెద్దలు బన్సీలాల్ నాయక్, గోపాల్ కరొబార్,శంకర్ నాయక్, రాము, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.