ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు

ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు

వనపర్తి బ్యూరో అక్టోబర్30 (జనంసాక్షి)వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి నియోజకవర్గంలోని ప్రజలందరూ కుటుంబ సభ్యులేనని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి తిప్పాయిపల్లి గ్రామంలో సోమవారం ఉదయం పాత పల్లి గ్రామంలో మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మంత్రి నిరంజన్ రెడ్డి తన ధ్యేయంగా పెట్టుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని ఆమె గుర్తు చేశారు. బిఆర్ఎస్ పార్టీ నుండి వనపర్తి శాసనసభకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆయన ఆశీర్వదించి ఆదరించి అత్యధిక భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. స్థానిక నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు