ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఆదరించండి.

ప్రజల కోసం కొట్లాడుతున్నాం ఆదరించండి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 7. (జనంసాక్షి). ప్రజల కోసం పోరాడుతున్నా బిజెపిని ఆదరించాలని సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా ఆశీర్వాదం పాదయాత్రలో భాగంగా సిరిసిల్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే ప్రజల కోసం సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, గూడూరు భాస్కర్, శీలంరాజు, ఆడేపు రవీందర్, పలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.