ప్రజల చూపు కాంగ్రెస్ వైపు : కొమ్మూరి

ప్రజల చూపు కాంగ్రెస్ వైపు : కొమ్మూరి

జనగామ బ్యూరో (జనంసాక్షి ): పట్టణం విశ్వ కర్మ సంఘం నాయకులు 30 కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పిసిసి మెంబర్ *చెంచారపు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పిసిసి మెంబర్ చేంచరపు శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, బి.ఆర్.ఎస్పార్టీ 10 సంవత్సరాలుగా ప్రజలను మాయమాటలతో విసుగు చెంది యువకులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వారికి భరోసా ఇస్తుందన్న నమ్మకంతోని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్, ఆకుల లక్ష్మయ్య, పిట్టల సతీష్, బండారు శ్రీనివాస్, పిక్క బీరప్ప, నాంపెల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు