ప్రజల వద్దకే ఆర్టీసీ లక్ష్మీపూర్ లో డి మ్ ప్రోగ్రాం

జనం సాక్షి సెప్టెంబర్ 9 జైనథ్
జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో ప్రజల వద్దకే ఆర్టీసీ బస్సు అనే ప్రోగ్రాంను డిపో మేనేజర్ లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ వద్ద నిర్వహించిన సదస్సులో డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్టిసి నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ అందించాలని ఉద్దేశంతో ప్రజల వద్దకే ఆర్టీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ బస్సులోనే ప్రయాణం చేయాలని బస్సులోనే భద్రత ఉంటుందని పిల్లలను బస్సులో పంపుతున్నారు తల్లిదండ్రులు ఆటోలో పోతున్నారు దయచేసి ఇలా చేయవద్దని డిపో మేనేజర్ లక్ష్మీపూర్ ప్రజలను కోరారు గ్రామ పెద్దలు సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ సరియైన సమయంలో బస్సు నడిస్తే ప్రజలు బస్సులోని ప్రయాణం చేస్తారని స్కూలుకు పోయే విద్యార్థులకు బస్సు సమయానికి రాక చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని కనీసం నాలుగు టైం లైన్ బస్సు సమయానికి రావాలని డిపో మేనేజర్ గారిని సర్పంచ్ ఉప సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి లక్ష్మీ రాములు ఉప సర్పంచ్ గాజంగుల స్వామి వార్డ్ మెంబర్ యోసపు శంకర్ మాజీ సర్పంచ్ భగత్ గౌతమ్ కే శ్రీనివాస్ నర్సింహులు H. రాములు D.పోశెట్టిK సురేష్ ఉషోదయ ఫ్రెండ్స్ యూత్ ప్రధాన కార్యదర్శి మడవి అశోక్ ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.