ప్రజాలసొమ్ము వృధా- అవగాహన లేని అధికారులు – తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరీష్

జనగామ (జనం సాక్షి)జూలై23:జనగామ జిల్లా కేంద్రం చిన్న వానకే సముద్రం ల తలపించిన రొడ్లు.. తెలుగు దేశం పార్టీ జనగామ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి సమ్మయ్య అధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిని హరీష్ పాల్గోన్నారు. రాష్ట్రం లోని భారీ వర్షాలతో కురుస్తున్న జనగామ పట్టణము అతలాకుతలమైందని, మోరిలు, నిండి షాపులముందు వ్యాపారులకు ఇబ్బందిగా మారిన తరుణంలో నేనున్నానని ముందే ఉండే నాయకుడు రామిని హరీష్ ..ఈ క్రమంలో తన స్వంత ఖర్చులతో ట్రాక్టర్ ను తెప్పించి దగ్గరుండి రోడ్డు మీద పేరుకుపోయిన నీరును ట్రాక్టర్ పైపు ద్వారా 2 రెండుగంటల పాటు నీళ్లను మళ్ళించడం జరింగింది,వారు చేస్తున్న పనులకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు బైరు బాబు, జిల్లా కార్యదర్శి పరకాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఎండీ ఎక్బల్, సీరాజ్, జనగామ నియోజక వర్గ నాయకులు కొణిదెల కిషన్ ప్రసాద్, గుగులోతూ కనకరాజు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎండీ చోటమియ, పట్టణ అధికార ప్రతినిధి తాళ్లపల్లి ఏల్లేష్, పట్టణ బీసీ సెల్ నాయకుడు గోళ్ల శ్రీనివాస్ రావు పాల్గొన్నారు,