ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి -సి.పి.ఓ. వెంకటరమణ

ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సీనియర్ జిల్లా అధికారి, సి.పి.ఓ. వెంకటరమణ, జిల్లా అధికారులకు సూచించారు.  సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టరేట్ ఏ.ఓ. వెంకటకృష్ణతో కలిసి సి.పి.ఓ. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా (39) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ. వెంకట కృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.