ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

అదనపు కలెక్టర్. శ్రీనివాస్ రెడ్డి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి నుండి 64 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.
రెవెన్యూ 57,
మున్సిపాలిటీ 01, జిల్లా పంచాయితీ అధికారి 2 , జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి 02, ఉపాధి కల్పన శాఖ 2 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.