‘హర్మూజ్ జలసంధి’ మూసివేత
` ఇరాన్ కీలక నిర్ణయం
` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు
` భద్రతా కౌన్సిల్ చేతిలో తుది నిర్ణయం!
` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్ పైనా ప్రభావం
` ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు..
` ఎల్ఎన్జీ రవాణాకు కూడా ఇదే అత్యంత కీలకం
టెహ్రాన్(జనంసాక్షి):మ దేశంలోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయానికి వచ్చింది. వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ అనుకున్నంత పని చేయనుందా? తమ దేశంలోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో.. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. ఈ మేరకు ఇరాన్ నిర్ణయానికి వచ్చినట్లు ఆ దేశ పార్లమెంట్ సీనియర్ సభ్యుడు ఇస్మాయిల్ కౌసరి అక్కడి మీడియాతో పంచుకున్నారు. అయితే, దీనిపై ఆ దేశ భద్రతా కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్ ద్వారానే రవాణా అవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఇది. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. సౌదీ, ఇరాన్, యూఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడిరట ఒక వంతు ఎల్ఎన్జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. ఇరాన్ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్యంపైనా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో 90శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందులో 40శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ప్రభుత్వం తన 74 రోజుల చమురు నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువపైనా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్ల వద్ద కదలాడుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ చమురును తీసుకొచ్చే నౌకలు ఒమన్-ఇరాన్ సముద్ర మార్గంలో ఉన్న హర్మోజ్ జల సంధిలో ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్ఎన్జీలోనూ 20% ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. ఈ నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. ఈ నేపథ్యంలో హర్మోజ్ జల సంధిని మూసివేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం కారణంగా భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని వాణిజ్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.