ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలి

తహసిల్దార్ హరికృష్ణ
మల్దకల్ సెప్టెంబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారము గ్రామపంచాయతీ కార్యదర్శులు,రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేశారు.బతుకమ్మ చీరలు పంపిణీ, కొత్తగా వచ్చిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు ,ఎంపీటీసీలు సమన్వయంతో పని చేయాలని తాసిల్దార్ సూచించారు. గ్రామాల్లోని రేషన్ డీలర్లుప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని  బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలన్నారు.ఈనెల 22వ తేదీనమల్దకల్ మండల కేంద్రంలోని  పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆ గ్రామాల నుండి కొత్తగా పింఛన్ లబ్ధిదారులను తీసుకొని రావాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో కృష్ణయ్య ,ఎంపీ ఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి,ఏపీవో స్వామి,ఏపీఎం, సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area