ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి

అలంపూర్ వలయాధికారి సూర్యనాయక్

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 26 : మానవుని మనగడ కొనసాగాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోదండపురం సిఐ కార్యాలయం నందు వలయాధికారి సూర్య నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాగణం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాళ్లఇండ్ల దగ్గర, ప్రభుత్వ కార్యాలయం దగ్గర మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదండపురం ఎస్సై వెంకట్ స్వామి, స్థానిక సర్పంచ్ సుంకన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.