ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

నర్సంపేట,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో నర్సంపేటలో మంగళవారం 2కే వాక్‌ ఫర్‌ ఓట్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు ఎంతో విలువైందని.. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత అమర వీరుల స్తూపం నుంచి జయలక్ష్మీ కూడలి వరకు అధికారులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులు చేత బూని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.