ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలి

వనపర్తి బ్యూరో/జనం సాక్షి :- రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు గుర్తింపు కార్డులను కలెక్టర్ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ బక్షి శ్రీకాంత్ రావు కు జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాష మంగళవారం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాంత్ రావు తను రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకొని కుటుంబ సభ్యుల ను అందరిని  రెడ్ క్రాస్ సభ్యత్వం చేయించడం అభినందనీయం అని శ్రీకాంత్ రావును స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞతి చేశారు. 2021-22 సంవత్సరంలో వనపర్తి జిల్లా 10,00,000 రూపాయల కు పైగా సభ్యత్వ రుసుము వసూలు చేసి (733) గురు పాట్రన్, వైస్ పాట్రన్, లైఫ్ మెంబర్లను సభ్యత్వ నమోదు చేయించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని ఇది సాధించడానికి జిల్లా పరిషత్ సి ఈ ఓ శ్రీ వెంకట్ రెడ్డి కృషి, ఎం పి డి ఓ లు, తేహసిల్దార్ల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తెలిపారు. 2022-23 సంవత్సరంలో కూడా రెడ్ క్రాస్ ను ఇంకా బలోపేతం చేయటానికి జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎం పి డి ఓ లు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఖాజ కుత్బుద్ధిన్, శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు