ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్పూర్, జూలై 24 ,( జనం సాక్షి) :
ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ త్వరగా కోలుకోవాలని చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో దేవస్థాన చైర్మన్ పొట్లపెల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి, ఎంఎల్ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య మోకాళ్ళ తో మెట్లు ఎక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేటిఆర్  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవల యాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నయని అన్నారు. దేవాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న చైర్మన్ పొట్లపెల్లి శ్రీధర్ రావును ఎంఎల్ఏ రాజయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా పరి షత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి,జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, దేవస్థానం చైర్మన్ పొట్లపెల్లి శ్రీధర్ రావు, ఎంపీపీ సరిత, నాయకులు  భూక్య రమేష్ నాయక్, వేల్పుల గట్టయ్య, పోలెపల్లి రంజిత్ రెడ్డి, మాలో తు రమేష్ నాయక్ ,చిర్ర నాగరాజు, డాక్టర్ గుర్రపు వెంకటేశ్వర్లు,వెంకటస్వామి ,కంకటి రవీందర్, రంగు హరీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.