ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకే ఉంది,పార్టీలకు కాదు:వెంకయ్య

ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదాను రాజకీయం చేయడం సరికాదని కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కీలకమైన అంశమని, ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉంది కాని, పార్టీలకు లేదన్నారు. యూపీఏ సర్కారు ప్రత్యేకహోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని వెంకయ్యనాయుడు వివరించారు. ఏపీ ఆర్థికలోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని, హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.