ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మేదరి మహీంద్ర సంఘం సభ్యులు…

గద్వాల ప్రతినిధి సెప్టెంబరు18 (జనంసాక్షి):- గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లా మేదరి మహీంద్ర సంఘం సభ్యులు సుంకులమ్మ మెట్టు దగ్గర నుండి వైఎస్సార్ సర్కిల్ పాతబస్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మేదరి మహేంద్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ..వెదురు దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా సీఎం కెసిఆర్ గారికీ తెలియజేయడం ఏమనగా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అలాగే దళిత బంధు,గిరిజన బంధు మాదిరి మేదరి బంధు అమలు చేయాలని, వెదురు సొసైటీలను ఏర్పాటు చేసి కుటుంబానికీ 5లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం అందిచాలని సీఎం కెసిఆర్ గారిని కోరడం జరిగింది…ఈకార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మేదరి మహేంద్ర సంఘం సభ్యులు తదితరులు సభ్యులు పాల్గొన్నారు