ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి……

టేకుమట్ల.జులై (జనంసాక్షి) గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ లందరికీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏల సంఘం జాయింట్ సెక్రెటరీ కూరపాటి రవీందర్ అన్నారు.వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక   తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు నిరవధిక సమ్మె కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-2020  అసెంబ్లీ సమావేశాలలో వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల  వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వారి వారి గ్రామాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి హామీని నెరవేర్చకపోతే పోవడం దారుణమన్నారు.ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనలతో వీఆర్ఏలు అందరూ సంతోష పడ్డామని,మా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని ఆశపడటం జరిగిందన్నారు.   వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీల పై జీవో అమలు చేసి వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీఆర్ఏలు కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రాజనర్సు,ఈర్ల స్వామి,అప్సర, రజిత, కిరణ్మయి,సందీప్,పైడి,జితేందర్,రాజు, వీఆర్ఏలు అందరూ తదితరులు పాల్గొన్నారు.