ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి.. సిపిఎం

బచ్చన్నపేట జూన్ 7 (జనం సాక్షి) బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల తోపాటు డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయని ఇందులో అత్యధికంగా పేద మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని మండలానికి 25 కిలోమీటర్ల దూరం నుండి జనగామ కు ఎన్నో ప్రయాసలకు ఓర్చి కాలేజీకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా వారి బాధలు తప్పాలంటే మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్ తోపాటు డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కర్రే రాములు రామగళ్ళ అశోక్ తమ్మడి మహేష్ ఐలయ్య ఉన్నారు