ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ పరికరాలు పంపిణి.
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్: హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు సహకారంతో జిల్లా పరిషత్ 15 ఆర్థిక సంఘం నుండి 4 లక్షల రూపాయలతో మంజూరైన సైన్స్ పరికరాలను దిర్సించర్ల,పెంచికల్ దిన్న,సోమారం,మేడారం గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష చొప్పున మంజూరు అయిన సైన్సు పరికరాలను ఎంపీపీ లకుమళ్ళ జ్యోతిబిక్షం, జెడ్పిటిసి రాపోలు నర్సయ్యతో కలసి మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య,ఎంఈఓ చత్రునాయక్,ఎంపివో విజయకుమారి,ఏ.ఈ మధు,ఎంపీటీసీలు యల్లబోయిన లింగ యాదవ్, నందిపాటి నాగవేణి గురవయ్య,మండల రాజేష్, మండల పార్టీ ఊపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, నాయకులు సుంకర శ్రీరామ్మూర్తి,నాగేష్, సందీప్ రెడ్డి,ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు,ఎస్ఎంసి చైర్మన్లు,సైన్స్ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.