వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ
` తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను వివరించిన ముఖ్యమంత్రి
` 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రోడ్మ్యాప్పై వివరణ
` హైదరాబాద్లో ఫాలోఅప్ సదస్సు నిర్వహణకు విజ్ఞప్తి
` ఫ్యూచర్సిటీలో యూపీసీ వోల్ట్ పెట్టుబడులు
` ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థ
` రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. సుమారు 4వేల మందికి ఉపాధి
` సౌర , పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
` గోద్రేజ్ ఛైర్మన్తో తెలంగాణ మంత్రుల భేటీ
` ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చ
` హైదరాబాద్ సందర్శించాలని కోరిన శ్రీధర్ బాబు
దావోస్(జనంసాక్షి):స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంఎండీ జెరెవిÖ జ్గన్స్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఏటా హైదరాబాద్లో ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని కోరారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎకనామిక్ ఫోరం బందం ఆయనకు తెలిపింది. సీ4ఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తోనూ సీఎం భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలను రేవంత్ వివరించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యాప్ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెవిÖజ్గంన్స్, అ4ఎఖీ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలో`అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో జరిగే దావోస్ లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సవిÖక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగ పడుతుందన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో అప్ సదస్సు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలలని కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సవిÖప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెవిÖజ్గన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది ’సమ్మర్ దావోస’ జరుగుతోందని,సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యాప్, లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెవిÖజ్గం్గªన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. తెలంగాణ ఆర్థిక వద్ది ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయని అభిప్రాయపడ్డారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలను వివరించారు. స్కిల్ డెవెలప్మెంట్, స్పోర్ట్స్కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన తెలంగాణ సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్టియ్రల్ రివల్యూషన్ పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు. ఆదర్శవంతమైన మోడల్గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై అ4ఎఖీ చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పంచుకుంటామని ఆయన హావిÖ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను విశ్లేషించారు. ఆర్థిక అభివద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్`జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా, దేశంలో సుస్థిర అభివద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందన్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏరోస్పేస్, డిఫెన్స్, బయో`డిజైన్, సాప్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్టిక్ర్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దష్టి పెట్టిందన్నారు.
ఫ్యూచర్సిటీలో యూపీసీ వోల్ట్ సంస్థ రూ.5వేల కోట్ల పెట్టుబడులు
దావోస్(జనంసాక్షి): భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.5వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు యూపీసీ వోల్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ ఎంవోయూ చేసుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహా వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్తో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బందం సమావేశమైంది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిపి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
సౌర , పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
దావోస్:తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా అభివద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని విద్యుత్ (క్లీన్ ఎలక్టిసిటీ) , గ్రీన్ హైడ్రజన్ అందిచాలనే ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తున్నది అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. డేటా సెంటర్ల నుంచి అధిక స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోందని చెప్పారు. నూతన తెలంగాణ ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్లో భాగంగా క్యూర్ ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్ ద్వారా మౌలిక సదుపాయాల అభివద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ సమావేశంలో రెవెన్యూ , హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
గోద్రేజ్ ఛైర్మన్తో తెలంగాణ మంత్రుల భేటీ
ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్టీస్ర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్లో ఉన్న గోద్రేజ్ క్రీమ్లైన్ డెయిరీ ప్లాంట్ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌళిక వసతులు ముఖ్యంగా స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
` ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం
` యువతకు ఎఐ శిక్షణ అందించాలి: సీఎం రేవంత్
` ‘తెలంగాణ రైజింగ’ బందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు
దావోస్(జనంసాక్షి):దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ’తెలంగాణ రైజింగ’ బందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏ ఐ అకాడవిÖకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏ ఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఏ ఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బందాన్ని ఆయన అభినందించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏ ఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివద్ధి దిశగా ప్రభుత్వం కషి చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన ఏ ఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏ ఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది.అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్లపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించ నున్నారు.
దావోస్ పర్యటన విజయవంతం
` జూరిచ్ బయల్దేరని సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి అమెరికాకు పయనం
దావోస్(జనంసాక్షి):‘తెలంగాణ రైజింగ’ ప్రతినిధుల బందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది.మూడు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది.వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం, హైదరాబాద్ లో వరల్డ్ ఎకనమిక్ ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలనే ప్రతిపాదన కు సానుకూల స్పందన లభించింది.మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం మూడు రోజుల తెలంగాణ ప్రతినిధి బందం దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది.దావోస్ లో కార్యక్రమాలు ముంగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దావోస్ నుంచి ఇండియా కు తిరుగు పయనమయ్యారు.


