ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

-వార్డ్ మెంబర్ గంధం.ప్రసాద్…

నాగర్ కర్నూల్ రూరల్:జులై 26(జనంసాక్షి)

నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు మంగళవారం వార్డ్ మెంబర్ గంధం.ప్రసాద్,ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గంధం ప్రసాద్ మాట్లాడుతూ,పాఠశాల అభివృద్ధికి దాతల సహకారంతో తన వంతు కృషి చేస్తానని,గ్రామంలోని ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని,ఆంగ్ల మాధ్యమంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులు నాణ్యమైన మధ్యాహ్న భోజనం తోపాటు నిష్ణార్థులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మల్లేష్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.