ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి):
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటదని పోచంపల్లి పాఠశాల ప్రధానోఉపాధ్యాయురాలు  కొలిపాక సంగీత అన్నారు.మండలంలోని పోచంపల్లి  లో మన ఊరు _మన బడి కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో నే పిల్లలు చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలకు పంపి ఆర్థికంగా నష్ట పోవద్దని ,ప్రభుత్వ పాఠశాలలోను ఆంగ్ల బోధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ బండి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు.