ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి):
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని రామతీర్థం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అన్నారు. మన ఊరు_ మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ప్రచార కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలకోటి కిరణ్,ఉపాధ్యాయులు అనురాధ, విద్యా కమిటీ చైర్మన్ సుమన్, పంచాయతీ కార్యదర్శి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area