ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలి

ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 08 , (జనం సాక్షి )వినాయక నిమర్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని , ఇబ్రహీంపట్నం ఎస్ హెచ్ ఓ ఉమా సాగర్ సూచన మేరకు ఎర్దండి గ్రామ పంచాయతీ పాలకకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలోని యూత్ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి వినాయక నిమర్జనానికి సంబంధించిన నియమ, నిబంధనలను వివరించారు.
ఎలాంటి గొడవలు జరగకుండా, శాంతి భద్రతలను పాటించి,ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని , ఒకవేళ నిబంధనలు ,అతిక్రమిస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్షణ గంగాధర్, ఉప సర్పంచ్ బట్టు శేఖర్,కార్యదర్శి పుదరి మనోజ్,జిపి సిబ్బంది నీరటి రత్నం,స్టాండింగ్ కమిటి కన్వీనర్ శేర గంగాధర్ ,పలు యూత్ ల అధ్యక్షులు , ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.