ప్రాథమికక హక్కులకు భంగం వాటిల్లుతోంది


మౌనం సరికాదన్న సోనియాగాంధీ
న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం సరికాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య మంటే అర్ధం తెలుసుకోవాలని ప్రజలను కోరారు. దేశ ప్రజాస్వామ్యానికి రిపేర్లు అవసరమన్నారు. 75వ స్వతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఒక ఆంగ్ల పత్రికలో రాసిన కథనంలో ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్లమెంట్‌పై దాడి చేసి, సాంప్రదాయాలను భంగపరిచి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తరుణంలో ప్రజలు స్వాతంత్యాన్రికి నిజమైన అర్ధం తెలుసుకోవాన్నారు.
మోదీ హయంలో జర్నలిస్టులకు, మేథావులకు, పార్లమెంటసభ్యులకు.. ఇలా ఎవరికీ వాక్‌స్వాతంత్యంª`ర లేదని ఆమె విమర్శించారు. ఆక్సిజన్‌కొరత, జీఎస్‌టీ తదితర అంశాలపై పార్లమెంట్‌లో అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశమే ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేస్తున్న డ్యామేజీని రిపేరు చేయాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి మోదీ వల్ల కనుమరుగైందని ఆరోపించారు. ఏడేళ్లుగా చర్చల్లేకుండా చట్టాలు
వస్తున్నాయని సోనియా వాపోయారు. దీనివల్ల పార్లమెంటు రబ్బరు స్టాంపుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ముందుకురాలేదని విమర్శించారు. పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలను మోదీ ప్రభుత్వం దురి?వనియోగం చేస్తోందని సోనియా ఆరోపించారు.