ప్రాథమికోన్నత పాఠశాల కుస్థాపూర్ పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం ……

ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు……
మల్లాపూర్, (జనం సాక్షి) సెప్టెంబర్:08 మండలం లోని ప్రాథమికోన్నత పాఠశాల కుస్థాపూర్ గురువారం రోజున వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది అని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు తెలిపారు. విద్యార్థుల చే మట్టితో తయారుచేసి వారిచే పూజలు అందుకొని,ఈ రోజు నిమర్జనం చేశారు. విద్యార్థులు మాకు విద్యాబుద్ధులు రావాలని ,భవిష్యత్తు లో ఉన్నత విద్యా చదవాలి, వేడుకున్నారు. అందరూ విద్యార్థులు కోలాటం, పాటలు, డాన్స్ లతో కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో వినాయక నిమజ్జనం చేశారు..ఇట్టి కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు షహభాజ్ హుస్సేన్, శృతి, సునీత, గణేష్, లహరి, సంజన విద్యార్థులు పాల్గొన్నారు.