ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌:ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహించేందుకు విద్యాశాఖ ఉత్వర్వులు జారీచేసింది.పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంబించాలంటే…40 లేదా అంతరకన్నా ఎక్కువ మంది విద్యార్టులుండాలి.మూడు కిలోమీటర్లు దూరంలో ప్రాధమికోన్నత లేదా ఉన్నత పాఠశాల లేకుండా ఉండాలని నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను స్వీకరిస్తున్నట్లు ప్రాధమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందానాఖన్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.విద్యాశాఖ సంచాలకులు మేరకు చర్యలు తీసుకొని ప్రదానోపాధ్యాయులకు తగిన ఆదేశాలు జారీచేయాలని సూచించారు.విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రాధమిక విద్యాశాఖ పర్యవేక్షణ కొనసాగాలి.దీనికి సంబందించిన చర్యల్లో భాగంగానే ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంబించాలని నిర్ణయించారు.