ప్రైవేటు పాఠశాలల్లో చదివే జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని డీఈవోకు వినతి

జనం సాక్షి చండ్రుగొండ (జూన్  25) : మండలంలోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో చదివే  జర్నలిస్టుల పిల్లలకు  ఫీజు రాయితీ  అవకాశం కల్పించాలని కోరుతూ  శనివారం మండలానికి విచ్చేసిన  జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ  మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణకు  మండల ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. అక్రిడేషన్ నాన్అక్రిడేషన్ జర్నలిస్టుల పిల్లలను సైతం  ఫీజు రాయితీ లో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ఈ విషయమై  జిల్లా విద్యాశాఖాధికారి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ మండల అధ్యక్షుడు రామిశెట్టి సైదయ్య ప్రధానకార్యదర్శి వెలగల మధు ఉపాధ్యక్షులు ఎస్కె జాఫర్  మునగాల కోటా సారీ పాషా వెంకటేష్ కృష్ణప్రసాద్  తదితరులు పాల్గొన్నారు