ఫోటో&వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ధరూర్ నూతన కమిటీ ఎన్నిక

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్18 (జనంసాక్షి)ధరూర్ మండల కేంద్రంలోని ఆదివారం ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియోషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు ఎస్.ఎస్.శేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధరూర్ మండల అధ్యక్షులుగా ప్రవీణ్ గౌడ్,ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి,కార్యదర్శులు రాజు, నరేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిలురమేష్ ,కోశాధికారి శ్యామ్ ,సలహాదారులుగా శివాజీ, బస్వరాజ్,వెంకటేష్ లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీలో బాధ్యతగా పనిచేసి గుర్తింపును తెచ్చుకోవాలని జిల్లా అధ్యక్షులు కోరారు.
నూతన కమీటీ కి ఎన్నికైన వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి వేణు,ధరూర్ మండల కమిటీ సభ్యులు శివ, నెట్టెంపాడు గోవిందు,బస్వరాజ్, జయరామ్, వెంకటేష్, చంటి, రమేష్, రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.