: స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ నాయకులు

.

ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

సంస్థ నారాయణపురం సెప్టెంబర్ 16 (జనం సాక్షి):
మండల
కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండలం సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా కామ్రేడ్ బొమ్మగాని ధర్మాభిక్షం విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా వెళ్లి తొలి అమరుడు అయిన దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి స్థానిక చౌరస్తాలో అమరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కురుమిద్ద శ్రీనివాస్,మండల సిపిఐ కార్యదర్శి దుబ్బాక భాస్కర్, సహాయ కార్యదర్శి చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ, సూర్వి నరసింహ,కప్పల నరసింహ, కొండూరి వెంకటేష్, పొట్ట సత్యం,పందుల యాదగిరి, పల్లె మల్లారెడ్డి,ఎర్రోళ్ల లింగయ్య, ఎన్. నాగరాజు, గడ్డం యాదగిరి, సింగపంగ మల్లయ్య, భీమనపల్లి గాలయ్య, నాతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.