ఫ్యాబ్ ఇండియా ఉద్యోగుల అరెస్టు….

పనాజి:ఫ్యాబ్ ఇండియా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కేసులో గోవా క్రైమ్ బ్యాంచ్ పోలీసులు రంగంలోకి నలుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా శాఖలున్న ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్ ఇండియా ఎండీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఎదురుకావడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. దీంతో గోవా ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. షాపులో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని, విచారణ వేగవవంతం చేశామని ఎస్పీ కార్తీక కశ్యప్ తెలిపారు.