ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు తీసుకుంటాం : స్పీకర్‌

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లిలో ఫ్లోరైడ్‌ భాధితులను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేసి, ఫ్లోరైడ్‌ నివారణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫ్లోరైడ్‌ భాధితులకు భరోసా కల్పించేందుకే తమ పర్యటన అని స్పీకర్‌ పేర్కొన్నారు.