బతుకమ్మ చీరల పంపిణీ

రాజోలి 23 సెప్టెంబరు(జనం సాక్షి)మండల కేంద్రమైన రాజోలి లో శుక్రవారం బతుకమ్మ చీరలను జడ్పీచైర్పర్సన్ సరిత, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ని ప్రతి మహిళ కూడా ఆత్మ గౌరవం తో బతకాలని తలచారని అందుకే మహిళలకు బాసటగా నిలుస్తున్నారు అని అన్నారు. మహిళ ల కోసం ఒంటరి మహిళ,వృద్దాప్య పింఛన్లు, వితంతు పించనులు ఇచ్చి వారికి అభయం ఇచ్చారని, ప్రతి ఆడపడుచుకు పెద్దన్నగా అండగా ఉన్నారని అన్నారు. 330 కోట్ల రూపాయల తో చేనేత కార్మికుల నుండీ తయారు చేపించిన చీరలను ప్రతి మహిళకు అందిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పట్ల మహిళలకు వృద్దులకు ప్రత్యేక అభిమానం ఉందని వారి అండతో ఆయన మరెన్నో బృహత్తర పథకాలు అమలు చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, ఉప సర్పంచ్ గోపాల్, గంగిరెడ్డి, శ్రీ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు