బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : బహుజన, బిసి బిడ్డ అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నిరంతరం కృషి చేస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు గెలుపే లక్ష్యంగా నేతకాని విద్యార్థి సంఘం తరఫున పనిచేస్తామని నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నేతకాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్ మాట్లాడుతూ.. మంథని నియోజక వర్గంలో ఎంతో మంది పేదలకు సేవ చేస్తూ ఈ ప్రాంతంలో 200 మందికి వివాహాలు పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తూ ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి అందే విధంగా నిరంతరం కృషి చేస్తున్న బహుజన బిడ్డ అన్ని సామాజిక వర్గాలను ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతున్న మంథని నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కు తెలంగాణ రాష్ట్ర నేత కానీ విద్యార్థి సంఘం తరఫున మద్దతు తెలుపుతున్నామని అన్నారు. గత ఐదు సంవత్సరాలపరిపాలనలో మంథని ప్రాంతంలో ఉన్న ప్రజలందరి అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల మన్నాళ్లు పొందిన బహుజన జననేత పుట్ట మధుకు ఈ ఎన్నికల్ల ప్రచారంలో మా నేతకాని విద్యార్థి సంఘం తరఫున పూర్తి స్థాయిలో మంథని నియోజక వర్గంలో ఉన్న నేతకాని సామాజిక వర్గానికి ఏకతాటిపై తీసుకువచ్చి పుట్ట మధు గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకుడు సెగ్గెం రాజేష్, నేతకాని విద్యార్థి సంఘం సభ్యులు సోషల్ మీడియా కార్యదర్శి బోర్లకుంట రాజేష్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నం ప్రశాంత్ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రెసిడెంట్ దుర్గం భాను ప్రసాద్, తాండూరు మండల అధ్యక్షుడు గొల్లపల్లి రాజేష్, రాష్ట్ర విద్యార్థి నాయకులు రూపేష్, గోమాస సుధాకర్, దుర్గం రాజ్ కుమార్ , బోయాజ్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.