బహుజన మహిళా గర్జన సభను విజయవంతం చేయండి

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 24 : బహుజన మహిళా గర్జన విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు మణికుమార్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు భవనంలో కన్వీనర్ తిరుపాల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించడం, మహిళా అభివృద్ధియే దేశాభివృద్ధి అని ఆయన అన్నారు. ఇది కేవలం బహుజన సమాజ్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని, బెహన్ కుమారి మాయావతి ఒక మహిళగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి గా కావడం బహుజన సమాజ్ పార్టీ ఒక మహిళకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నిదర్శనం అన్నారు. బహుజన మహిళ గర్జన సమావేశానికి ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరుకానున్నట్లు వారు తెలిపారు. కావున మహిళలు మేల్కొని వేలాదిగా తరలివచ్చి అలంపూర్ నియోజకవర్గం లో ఉన్న శాంతినగర్ దుర్గ భవాని ఫంక్షన్ హాల్ లో జరిగే సభను విజయవంతం చేయవలసిందిగా బీఎస్పీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రాంబాబు, బిసన్న, మోహన్ రాజు, దుబ్బన్న, సెక్టర్ ప్రెసిడెంట్ అశోక్, ఆనంద్, సాతర్ల బీసన్న, ప్రభాకర్, ఎండి పాషా, నరసింహులు, రాముడు, రవి కిరణ్, చిరంజీవి, శ్రీరాములు, బాలు తదితరులు పాల్గొన్నారు