బాగ్ధాద్‌లో బాంబుల మోత: 27 మంది మృతి

బాగ్ధాద్‌, జనంసాక్షి: ఇరాక్‌ రాజధాని బాగ్ధాద్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. ముష్కరమూకలు తెల్లవారుజామునే రహదారులపై రక్తం పారించారు. వరుసగా జరిగిన కారు బాంబుల పేలుళ్లలో 27 మంది మృతి చెందారు. సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయింస్తోన్నారు. కాగా, మరో వారం రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో పేలుళ్లు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.