బాత్ రూంలో జారిపడ్డ కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలు జారి పడటంతో గాయమైనట్లు తెలిసింది. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అర్థరాత్రి కాలికి పంచె తగలడంతో… కేసీఆర్ కాలు జారి పడ్డారు. రాత్రి కొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు, ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత మరిన్ని టెస్టులు చేస్తారని తెలిసింది. కాలికి సర్జరీ చెయ్యాలా, వద్దా అనేది కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కేసీఆర్ భార్య ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కేటీఆర్, కవిత ఆస్పత్రికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది.