పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం 

పీలేరు వద్ద రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్న యువకులను నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై కదిరి రైల్వే ఎస్ఐ రహీం కథనం. పీలేరు కు చెందిన శ్రీనివాసులు కొడుకు కిరణ్ కుమార్(19), అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు యాసీన్(17) పులిచెర్ల రోడ్డులో రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగుతుండగా రైలు ఢీకొని మృతి చెందినట్లు సమాచారం అందినట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని చెప్పారు