బాధితుని పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి.

వనపర్తి బ్యూరో అక్టోబర్29( జనంసాక్షి)

చిట్యాల తూర్పు తండా సింగిల్ విండో డైరెక్టర్ భీముడు నాయక్ కు అనారోగ్యం కారణంగా రెండు కాళ్లను వైద్యులు తీసివేయడం జరిగింది . విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని వెంకట సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీముడు నాయక్ ను పరామర్శించారు . ఆరోగ్య పరిస్థితి గురుంచి వైద్యులతో మంత్రి నిరంజన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ భానుప్రకాశ్ రావు , తూర్పు తండా సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ , మండల యువజన సంఘం అధ్యక్షుడు చిట్యాల రాము తదితరులు మంత్రి వెంట ఉన్నారు