బాధిత కుటుబానికి అండగా టీమ్ జననీ

ఖానాపూర్, నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 24(జనం సాక్షి):  ఖానాపూర్ పట్టణం లోని శ్రీ రామ్ నగర్ కాలనీ కి చెందిన పంబాల బుచ్చన్నకు ఇటీవల  ప్రమాద వశాత్తూ ద్విచక్ర వాహనం డీ కొట్టడం తో ఎడమ కాలు మూడు వేళ్ళు పూర్తిగా తెగి పోయి బలమైన గాయం అయ్యింది. దాని వల్ల ఆ నిరుపేద కుటుంబం దీనావస్త లో ఉందని తెలిసిన టీమ్ జననీ సభ్యులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం రూ. 10 వేళ ఆర్థిక సహాయం మరియు రెండు నెలలకు సరిపడా సరుకులు అందజేశారు. భవిష్యత్తు లో ఆ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జననీ  ఛైర్మెన్ తోట  సుమిత్ మాట్లాడుతూ  ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కటుంబాలకు అండగా టీమ్ జననీ నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ జనని సభ్యులు మాజీ వైస్ ఎంపిపి తోట సత్యం, తోట భీమేశ్వర్, అడ్వకేట్ వెంకట్ మహేంద్ర, చింతపండు రవి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.