భారత్‌పై అమెరికా ట్యాక్స్‌వార్‌

` మన దేశ వస్తువులపై 25 శాతం టారీఫ్‌ల విధింపు
` నేటి అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన ట్రంప్‌
` ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది
` కానీ భారత్‌ మాత్రం ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది
` అందుకే సుంకాలకు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం: అమెరికా అధ్యక్షుడు
` భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం.
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పట్టు నెగ్గించుకున్నాడు. భారత్‌పై సుంకాల చర్యలకు ఉపక్రమించారు. మన దేశ వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు- ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు- చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్‌ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్‌పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్‌, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటు-న్నాయి. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ’ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ప్రకటించారు. ఇటీవల భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ట్రంప్‌.. ఆగస్టు 1ని డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ఏప్రిల్‌లోనే ప్రకటన చేసినప్పటికీ.. చర్చల కోసం వీటి అమలుకు గడువు ఇచ్చారు. ఇక భారత్‌పై సుంకాల విషయంలో ఇటీ-వల స్కాట్లాండ్‌ పర్యటన సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్‌ సుంకాలు విధిస్తోందని, అలా చేయడం తగదన్నారు.

దేశ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం
` అందుకోసం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం
` ట్రంప్‌ సుంకాల ప్రకటనపై భారత్‌ స్పందన
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పెనాల్టీతో కలిపి ఇవి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. దీనిపై భారత్‌ స్పందించింది. ట్రంప్‌ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది.