బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఉత్తమ్

హుజూర్ నగర్ నవంబర్ 22 (జనంసాక్షి): హుజూర్ నగర్
పట్టణ పరిధిలోని తిలక్ నగర్ 14వ వార్డుకి చెందిన డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుబాటి బాబురావు గత కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ అవ్వడంతో మంగళవారం వారి కుటుంబాన్ని మాజీ టీపీసీసీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ బాబురావు కుటుంబానికి అన్ని విధాల సహాయం చేస్తానని, మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బాచిమంచి గిరిబాబు, వార్డు అధ్యక్షులు కోల్లపూడి యోహాన్, లచ్చిమల్ల నాగేశ్వరరావు, పులిచింతల వెంకటరెడ్డి, కోల్లపూడి డేవిడ్, వేముల నాగరాజు, సులువ చంద్రశేఖర్, జింజిరాల సైదులు, దగ్గుపాటి సత్యానందం, కోలపుడి కళ్యాణ్, మామిడి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.