బాసర ఐఐఐటీలో సీటు ,

సంపాదించిన విద్యార్థికి సన్మానం

 

రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జాకటి రాజు , జయశీల దంపతుల చిన్న కూతురు నవనీత
ప్రతిష్టాత్మక బాసర
ఐఐటీలో సీటు దక్కించుకుంది. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ తిగుల్ల గంగామణి రాజవరప్రసాద్ నవనితకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బాసర
ఐఐఐటీలో సీటు సాధించిన నవనిత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని కితాబిచ్చారు. ఐఐఐటీలో సీటు రావడం మాములు విషయం కాదని పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో
గ్రామ పంచాయతీ సెక్రెటరీ గంగారాం, గ్రామ వార్డు సభ్యులు కార్తీక్ నడిపింటి , మరియు గ్రామ నాయకులు అర్జున్, అనిల్, మచెందర్,శంకర్, రాజకుమార్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.